News March 19, 2024
అనంత: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

చెన్నై కొత్తపల్లి హైవేపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు నుంచి అంబులెన్స్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని తాడిపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి చెన్నై కొత్తపల్లి సమీపంలో ముందు వెళ్తున్న బస్సుని అంబులెన్స్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 15, 2025
గుత్తిలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్

గుత్తిలో ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గౌతమీపురి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుత్తి ఆర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల జట్లు కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
News September 14, 2025
లోక్సభ ర్యాంకిగ్స్లో అనంతపురం MPకి 8ర్యాంక్

లోక్సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్లు ఇచ్చింది. ఈ నివేదికలో అనంతపురం MP అంబికా లక్ష్మీనారాయణ 8వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 78 ప్రశ్నలు అడగగా, 8 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 89.71గా ఉంది. ఆయన పనితీరుపై మీ కామెంట్..!
News September 14, 2025
వైద్యాధికారులతో అనంతపురం కలెక్టర్ సమావేశం

అనంతపురం జిల్లా కొత్త కలెక్టర్ ఆనంద్ను DMHO డాక్టర్ దేవి పుష్పగుచ్చంతో శనివారం స్వాగతించారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైద్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు అందుతున్న సేవలపై DMHOతో చర్చించారు. జిల్లాలో PHC, CHC, విలేజ్ హెల్త్ సెంటర్, క్లినిక్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.