News October 13, 2024

అనంత జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు: మంత్రి లోకేశ్

image

అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీల పుట్టినిల్లు అన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈనెల 17న అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News October 13, 2024

‘మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు’

image

పుట్టపర్తిలో సోమవారం జరిగే మద్యం దుకాణాల లాటరీ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెండర్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనల గురించి తెలిపారు. మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

News October 13, 2024

గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి వ్యక్తి మృతి

image

పెనుకొండ మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి హిందూపురం మండలం లింకంపల్లి గ్రామానికి చెందిన హానిస్ ఖాన్(42) ఆదివారం మృతిచెందారు. ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడిపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాపాడే లోపే మరణించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News October 13, 2024

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. రేపటి నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో ఉండాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినట్లు తెలిపారు.