News December 13, 2024

అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు: MLA కాల్వ

image

అనంతపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ విప్ రాయదుర్గం MLA కాల్వ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనంత జిల్లా కరవును గుర్తించిన తొలి సీఎం చంద్రబాబు అని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు రైతాంగానికి, సాగునీటి రంగానికి ఏమీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.

Similar News

News January 17, 2025

వీరుడా.. ఇక సెలవు

image

విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి (45) అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. చెన్నేకొత్తపల్లి మండలం బసినేపల్లిలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. అమర్‌రహే అంటూ ప్రజలు నివాళులర్పించారు.

News January 17, 2025

పెనుకొండ కియా నుంచి కొత్త కారు

image

పెనుకొండ కియా కంపెనీ నుంచి కియా సిరోస్ (Kia Syros) కారు ఉత్పత్తి ప్రారంభమైంది. ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న ఆటో ఎక్స్‌పో-2025లో ఈ కారును ప్రదర్శించనున్నారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 1న కారు ధర నిర్ణయిస్తామని సీఈవో హొసంగ్‌ తెలిపారు. ఇప్పటికే 10,258 మంది బుక్‌ చేసుకున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయని వివరించారు.

News January 16, 2025

పక్షుల కోసం 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్ల ఏర్పాటు

image

పక్షులను రక్షించడానికి 1.40 లక్షల మానవ నిర్మిత గూళ్లు ఏర్పాటు చేసి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కావడం అభినందనీయమని అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ పేర్కొన్నారు. గ్రీన్ ఆర్మీ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ అచ్చుల కోసం గూళ్లను ఏర్పాటు చేయడంపై కలెక్టర్ అభినందించారు. ఇందుకు హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ వారు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు.