News February 25, 2025

అనంత జిల్లా వ్యాప్తంగా 59 ఫిర్యాదులు

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.

News November 8, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి యువకులు

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు మండలం కొనకొందల జరిగిన బాలబాలికల 35వ సబ్ జూనియర్ క్రీడా పోటీలలో తాడిపత్రి కబడ్డీ క్రీడాకారులు ఉభయ్ చంద్ర, హర్షవర్ధన్, మనోజ్ కుమార్ ప్రతిభ కనబరిచి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. కడప జిల్లా పులివెందులలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో వీరు పాల్గొంటారని కోచ్ శివ పేర్కొన్నారు.

News November 6, 2025

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తాడిపత్రి అమ్మాయిలు

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలలో తాడిపత్రి అమ్మాయిలు సత్తా చాటారు. SGFI ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17 విభాగంలో అర్షియ, అవనిక, చాందిని.. అండర్-14 విభాగంలో ఆయేషా జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కబడ్డీ కోచ్ లక్ష్మీ నరసింహ తెలిపారు.