News September 13, 2024
అనంత: నూరుల్లా దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం

తాడిపత్రిలో గురువారం రాత్రి నూరుల్లా(34) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సీఐ సాయిప్రసాద్ వెళ్లడించారు. ‘నూరుల్లా ఆర్జాస్ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగం చేసేవారు. కొన్నేళ్ల నుంచి చిన్న బజార్కు చెందిన మహిళతో సన్నిహితంగా ఉన్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకొని సదరు మహిళ ఇంటి వద్దకు వెళ్లడం ఆమె బంధువులు చూశారు. ఆవేశంతో బండరాళ్లతో కొట్టి హత్య చేశారు’ అని తెలిపారు.
Similar News
News January 6, 2026
ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి: ఇన్ఛార్జ్ కలెక్టర్

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.
News January 6, 2026
ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి: ఇన్ఛార్జ్ కలెక్టర్

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.
News January 5, 2026
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వీడాలి: ఇన్ఛార్జ్ కలెక్టర్

ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 629 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి ఎండార్స్మెంట్ ఇవ్వాలని, బియాండ్ ఎస్ఎల్ఏ లేకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు సీఎంఓ, ఎమ్మెల్యే, ఎంపీ పెండింగ్ ఫిర్యాదులను పూర్తి చేయాలన్నారు.


