News July 4, 2024
అనంత: నేడు విద్యాసంస్థల బంద్.. పోలీసుల అప్రమత్తం

విద్యార్థి సంఘాలు నేడు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అనంత జిల్లా పోలీస్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నిర్వహించే పలు పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, ఇతరత్రా డిమాండ్లతో SFI, AISF, PDSEU, AISA, NSUI, PDSU సంఘాలు ఉమ్మడిగా బంద్ చేపట్టనున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News December 15, 2025
ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.
News December 15, 2025
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: SP

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే ప్రతి పిటిషన్ను విచారించి తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 96 అర్జీలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News December 15, 2025
పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్ ఆనంద్

అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యులని, ఆయన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కూడా పాల్గొన్నారు.


