News April 9, 2024

అనంత: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న పుల్లన్న పొరపాటున మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగినట్లు సమాచారం. అయితే తాగిన గంటలోనే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 26, 2025

పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు. 

News March 26, 2025

విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన.. ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు

image

గోరంట్లలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిపతిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన గిరిజన సంఘాల నాయకులు పోలీసులను కలిసి పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ రత్న కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

News March 26, 2025

అనంత: ‘రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

image

క్షేత్రస్థాయిలో ఎలాంటి పెండింగ్ లేకుండా రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగింత, రీసర్వే, రెవెన్యూ సర్వీసులు, PGRS, తదితర అంశాలపై RDOలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

error: Content is protected !!