News February 14, 2025
అనంత: ప్రణతికి డాక్టరేట్

అనంతపురానికి చెందిన ఓ.ప్రణతి ఓ.ప్రణతి గురువారం డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాదులోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(CESS)లో ప్రొఫెసర్ బలరాములు పర్యవేక్షణలో ‘పట్టణ, గ్రామీణ రాజకీయాలలో మహిళల పాత్ర’ అనే అంశంపై ప్రణతి చేసిన పరిశోధనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న ఆమెను సిబ్బంది అభినందించారు.
Similar News
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
News November 25, 2025
GNT: సంక్రాంతి రైళ్లకు ఇప్పుడే వెల్లువ.!

వచ్చే ఏడాది సంక్రాంతి రద్దీ ప్రభావం ముందే కనిపిస్తోంది. రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు తెరవడంతో ప్రధాన రైళ్లలో బెర్తులు పూర్తిగా నిండిపోయాయి. పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్లు శతకానికి ఎగబాకగా, కొన్నింటిలో నోరూమ్ సందేశాలు దర్శనమిస్తున్నాయి. హౌరా, సికింద్రాబాద్, బెంగళూరు మార్గాల్లో డిమాండ్ అధికం. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ముందుగానే బుకింగ్ చేసుకోవడంతో పరిస్థితి మరింత కఠినమైంది.
News November 25, 2025
అనంతపురం: దాడి కేసులో ఏడుగురి అరెస్ట్

అనంతపురం నగరం సాయి నగర్ 3rd క్రాస్లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజుల రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించామని పేర్కొన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు, బైక్, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.


