News May 25, 2024
అనంత: మధుసూదన్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు

పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరుడు మధుసూదన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నెల 13న నల్లమాడ మండలంలోని నల్ల సింగయ్యగారి పల్లెలో మధుసూదన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలపై దాడికి ప్రయత్నించిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఎస్సై రమేశ్ బాబు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా అతడు పరారీలో ఉన్నారు.
Similar News
News December 3, 2025
కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 3, 2025
కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 2, 2025
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్కు నోటీసులు ఇచ్చామన్నారు.


