News April 12, 2024

అనంత: రంజాన్ పండుగ వేళ విషాదం

image

కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన డ్రైవర్ లాల్ బాషా విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నమాజు చదువుకునే ముందు వుజూ చేసుకునేందుకు నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది. ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.  ఉరవకొండలో చికిత్స పొందుతూ బాషా మృతి చెందాడు. 

Similar News

News March 22, 2025

ATP: శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్ష: ఎస్పీ

image

ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్‌కి చేరుకొని రక్షిస్తుందన్నారు.

News March 21, 2025

ATP: శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్ష: ఎస్పీ

image

ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్‌కి చేరుకొని రక్షిస్తుందన్నారు.

News March 21, 2025

ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.

error: Content is protected !!