News October 1, 2024

అనంత: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం

image

రాయదుర్గం మండలం టీ.వీరాపురం సమీపంలో రాయదుర్గం-కణేకల్లు ప్రధాన రోడ్డుపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 4.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన బొమ్మన్నగా స్థానికులు గుర్తించారు.

Similar News

News October 22, 2025

ఎర్రచందనం అనుకొని తనిఖీలు.. తీరా చూస్తే సండ్ర మొద్దులు..!

image

యాడికి మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొలిమిగుండ్ల నుంచి బుగ్గ మీదుగా యాడికికి వస్తున్న ఐచర్ వాహనాన్ని సీఐ ఈరన్న తన సిబ్బంది నిలిసి తనిఖీ చేవారు. అయితే అవి సండ్ర మొద్దులు అని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.

News October 22, 2025

ALL THE BEST

image

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం నీరజ తెలిపారు. చంద్రగిరిలో జరిగే అండర్-14 విభాగంలో బిందు, నందు, లక్ష్మి, కడపలో జరిగే అండర్-17 విభాగంలో జగదీశ్వరి ఎంపికయ్యారు. క్రీడాకారులను పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, బాలకృష్ణ, ఉమ, లలిత, వెంకటలక్ష్మి, మధుమాల, కమల, సువర్ణ అభినందించారు.

News October 22, 2025

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

image

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.