News July 15, 2024
అనంత: రైతు సేవాకేంద్రాల్లో పశుగ్రాస జొన్న విత్తనాల పంపిణీ

అనంతపురం జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీతో పశుగ్రాస జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆదివారం వరకు రైతు సేవాకేంద్రాలు, పశువైద్యశాలల్లో పశుగ్రాస వారోత్సాలను నిర్వహించామన్నారు. పశుపోషణకు ఉపయోగపడే విధంగా 55 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. 75శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
News October 19, 2025
‘రబీలో 1,07,503 హెక్టార్లు సాగులోకి రావొచ్చు’

రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పప్పుశనగ 65,017 హెక్టార్లు, నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7888 హెక్టార్లు, వరి 6069, జొన్న 4919, ఉలవ 1377, పొద్దుతిరుగుడు 1230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చన్నారు. గతేడాది రబీలో సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 హెక్టార్లు తగ్గవచ్చన్నారు.