News April 5, 2024
అనంత: వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్థి మృతి
యాడికి మండలంలో వడదెబ్బకు గురై బీటెక్ విద్యార్ధి మృతిచెందాడు. మండల పరిధిలోని రాయలచెరువుకు చెందిన నిఖిల్ చౌదరి తమ సొంత పరిశ్రమ పనుల నిమిత్తం 2 రోజులు ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 6, 2024
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు విద్యార్థినుల ఎంపిక
పుట్టపర్తి మండలంలోని జగరాజుపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థినులు అండర్-14 విభాగంలో హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమేశ్ బాబు, పీడీ అజీమ్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన ఓం శ్రీ, ఫర్హాన్ అనే విద్యార్థినులు ఎంపిక అయ్యారన్నారు.
News October 6, 2024
రేపు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలచే వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
News October 6, 2024
రేపు JNTUలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం జేఎన్టీయూలో MBA, MCA స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ కిరణ్మయి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి MBAలో 9 సీట్లు, MCAలో 4 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీలోని పరిపాలన భవనం నందు సోమవారం ఉదయం 9.00 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.