News April 11, 2025
అనంత: వర్షాల వేళ ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి

ఏపీ విపత్తుల సంస్థ సూచనల మేరకు అనంతపురం జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండరాదని సూచించారు. సురక్షితమైన భవనాల్లో ప్రతి ఒక్కరూ ఆశ్రయం పొందాలి.. వర్షాల వేళ అందరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Similar News
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు

YCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రి రూరల్ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక పోలీసు బృందం ఆయన నివాసానికి చేరుకుని అరెస్ట్ చేసింది. పరకామణి కేసు, సీఐ సతీశ్ మృతిపై డిబేట్లో మాట్లాడినందుకు ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను రోడ్డు మార్గాన తాడిపత్రికి తరలిస్తున్నారు. సీఐ మృతిపై తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
News November 18, 2025
అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.


