News February 12, 2025
అనంత: ‘వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె’

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్యం కార్మికులకు బుధవారం వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు AITUC నగర కార్యదర్శి కృష్ణుడు పేర్కొన్నారు. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం చేయలేదని అన్నారు.
Similar News
News March 15, 2025
సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 15, 2025
ATP: విద్యుత్ షాక్తో రైతు మృతి

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని నాయకునిపల్లి గ్రామానికి చెందిన మునిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్కు ఉన్న మెయిన్ లైన్ నుంచి వచ్చే హెడ్ ఫీజులు కట్ కావడంతో వేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విద్యుత్తు ప్రవహించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 15, 2025
ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి

ఆదోనిలోని ఇంద్రనగర్కు చెందిన బాలు, గుత్తి మండలం కొత్తపేటకు చెందిన స్రవంతి ప్రేమించుకుని శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్నారు. రెండేళ్ల నుంచి ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని చాటిచెబుతూ.. పెద్దల సమక్షంలో ఆదోనిలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.