News February 22, 2025

అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

image

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 15, 2025

నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్‌లైన్‌ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 15, 2025

8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

image

మహిళల క్రికెట్‌కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.

News November 15, 2025

WNP: ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి బీసీ సంక్షేమశాఖ అండగా నిలుస్తోందని వనపర్తిజిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ముజాహిద్ ఖాన్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను 9,10వ తరగతుల బీసీ,ఈబీసీ విద్యార్థుల కోసం ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ పథకంకింద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అర్హులైన విద్యార్థులుతప్పనిసరిగా https://teలan-ganaepass.cgg.gov.in లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.