News February 22, 2025

అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

image

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 27, 2026

BHPL: అంగన్వాడీ విద్యార్థులకు యూనిఫామ్‌లు!

image

అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆకర్షణీయమైన యూనిఫారం సిద్ధమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు రెండు రకాల దోస్తులు త్వరలో పని చేయనున్నారు. ఇక చిన్నారులంతా యూనిఫాం దుస్తులతో హాజరు కానున్నారు. మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఐదు మండలాల్లో 227 అంగన్వాడీ కేంద్రాల్లో 4,015 మంది విద్యార్థులకు త్వరలోనే యూనిఫాం పంపిణీ చేస్తామని సీడీపీఓ రాధిక తెలిపారు.

News February 27, 2026

HYD: ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

image

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ.10ల కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటకు పొక్కింది. కాగా ప్రభుత్వం దోమల నివారణకు ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది.

News February 27, 2026

అతిథులకు నిలయం అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్!

image

వరంగల్ నిట్ ప్రాంగణంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం గెస్ట్ హౌస్ అతిథులకు నిలయం. ప్రతిష్ఠాత్మకంగా జరిగే స్ప్రింగ్ స్ప్రీ, టెక్నోజియాన్, కాన్వకేషన్ లాంటి వేడుకలకు వచ్చే ముఖ్య అతిథులతో పాటు కేంద్ర మంత్రులు, సినీ నటులకు విడిది కల్పిస్తుంది. 2008 ఆగస్ట్ 18న అబ్దుల్ కలాం స్వయంగా ఈ అతిథి గృహాన్ని సందర్శించారు. ఆ రోజున ఆల్ట్రా మెగా హాస్టల్ భవనానికి పునాది వేసి, కంప్యూటర్ సెంటర్ ప్రారంభించారు.