News April 12, 2025

అనంత: 477 మంది లబ్ధిదారులకు మెగా చెక్ పంపిణీ

image

2024-25 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లాలో స్వయం ఉపాధి పథకానికి 477 మంది లబ్ధిదారులు ఎంపిక అయినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ శుక్రవారం తెలిపారు. 477 మందికి రూ.11.61 కోట్ల మెగా చెక్కును ఎంపీ అంబికా నారాయణ, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అందజేశారు. స్వయం ఉపాధి పథకానికి సంబంధించి మండలాల వారిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, చెక్కులు అందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు.

Similar News

News December 3, 2025

కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

image

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్‌లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 3, 2025

కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

image

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్‌లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్‌కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 2, 2025

ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

image

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్‌లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.