News June 11, 2024
అనంత: 7 కేసుల్లో 370 మంది అరెస్టు

తాడిపత్రిలో ఎన్నికల నేపథ్యంలో మే 13, 14వ తేదీల్లో జరిగిన అల్లర్లపై సిట్ ఎన్నికల సంఘానికి ఈనెల 1న తుది నివేదిక అందజేసింది. అల్లర్లపై మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్, జూనియర్ కళాశాల మైదానం, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద జరిగిన దాడులు, ఏయే కేసుల్లో ఎంత మందిని నిందితులుగా గుర్తించారు? లాంటి వివరాలతో మొత్తం 370 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
Similar News
News March 25, 2025
ఆ YCP నేతకు తాడిపత్రిలోకి NO ENTRY

తాడిపత్రికి చెందిన YCP ముస్లిం మైనార్టీ నేత ఫయాజ్ బాషాను పది రోజులపాటు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు బహిష్కరించారు. గత 3రోజుల క్రితం ఫయాజ్ బాషా, JC ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం జరిగిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా.. ఎలాంటి అల్లర్లు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫయాజ్ బాషాను పోలీసులు అనంతపురం తరలించారు.
News March 25, 2025
తాడిపత్రిలో పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డ్!

తాడిపత్రి నియోజకవర్గంలోని YCP శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. కీలక నేతలంతా యాక్టివ్గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలూ పెద్దగా జరగడంలేదు. శాంతి భద్రతల సమస్య దృష్ట్యా తనను తాడిపత్రికి వెళ్లకూడదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. 9నెలల నుంచి ఇదే సాగుతోంది. ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. మరోవైపు దూకుడుతో JC తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
News March 25, 2025
MMTS ఘటన.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాల

హైదరాబాద్లోని MMTS <<15866506>>రైలు<<>> మహిళా కోచ్లో ఒంటరిగా ఉన్న అనంతపురం జిల్లా యువతి (23)పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యువకుడి వయసు 25ఏళ్లు ఉంటుందని అంచనాకు వచ్చిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.