News April 9, 2025

అనకాపల్లిలో 95% మూల్యాంకనం పూర్తి: డీఈవో

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకన ప్రక్రియ తుదిదశకు చేరినట్లు డీఈవో జి.అప్పారావు నాయుడు తెలిపారు. మంగళవారం అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. మూడు కేంద్రాల్లో ఈనెల మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాకు 1,66,237 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. 594 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. 95 శాతం మూల్యాంకనం పూర్తయిందన్నారు.

Similar News

News December 7, 2025

NKD: సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు

image

ఖేడ్ మండలంలో సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు నిలిచారు. పీర్ల తాండకు చెందిన సాలిబాయి, ఆమె మనువడు సచిన్‌ నామినేషన్ వేశారు. ఇరువురి నామినేషన్లు సక్రమంగానే ఉండగా ఈనెల 9న సచిన్ నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. దీంతో సాలిబాయి ఏకగ్రీవం కానున్నారు. 8 వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో జీపీ పాలకవర్గం ఏకగ్రీవం అయినట్టే. ఈమె భర్త జీవులనాయక్ 1987లో ఖేడ్ ప్రథమ MPP అయ్యారు. ఈయన సర్పంచ్‌గానూ పనిచేశారు.

News December 7, 2025

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ, అలాగే మరికొందరికి స్థానచలనం కల్పిస్తూ సీపీ రాజశేఖర్ బాబు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పటమట ఎస్ఐ కృష్ణ వర్మ, తిరువూరు ఎస్ఐ సత్యనారాయణను 5వ ట్రాఫిక్‌కు భవానీపురంలో ఉన్న ఆనంద్ కుమార్‌ను సైబర్ క్రైమ్‌కు సుమన్‌ను పీసీఆర్‌కు కొత్తపేటలో ఉన్న రాజనరేంద్రను గుణదల పోలీస్ స్టేషన్‌కు నందిగామలో ఉన్న శాతకర్ణిను తిరువూరుకు బదిలీ చేశారు.

News December 7, 2025

నిజామాబాద్: DCCలకు పరీక్ష

image

కొత్తగా ఎన్నికైన ఉమ్మడి NZB జిల్లా DCC అధ్యక్షులు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NZB DCC అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి, KMR DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఆలేను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే CM ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.