News March 31, 2025
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం వద్ద శంకుస్థాపన చేశారు. రూ.243 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 13.8 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారిగా విస్తరించనున్నారు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.
Similar News
News October 19, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొన్ని చోట్ల స్వల్పంగా పెరగ్గా, మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. APలోని చిత్తూరు, కృష్ణా, పల్నాడులో KG ధర రూ.220-240, గుంటూరులో రూ.200-220గా ఉంది. అటు TGలోని HYDలో కిలో రూ.220-240, వరంగల్, హన్మకొండలో రూ.210-230కు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? COMMENT
News October 19, 2025
విశాఖ మ్యూజియం ఎప్పుడైనా సందర్శించారా?

విశాఖ మ్యూజియం నగర వాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. దీనిని అప్పటి CM జనార్దన్ రెడ్డి 1991లో ప్రారంభించారు. డచ్ భవనంలో ఉన్న మారిటైమ్ మ్యూజియంలోని 10 గదుల్లో నేవీ ఉపయోగించిన ఆయుధాలు, నేవీ చేసిన యుద్దాల సమచారాన్ని కళాఖండాల రూపంలో ప్రదర్శించారు. అదేవిధంగా విశాఖ మ్యూజియం వెనుక ఉన్న రెండంతస్థుల భవనాన్ని హెరిటేజ్ మ్యూజియంగా మార్చారు. ఇందులో పురావస్తు విభాగానికి చెందిన 5 గ్యాలరీలు కలవు.
News October 19, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.