News March 17, 2025

అనకాపల్లి: ‘అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి’

image

స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రతి మండల ప్రత్యేక అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో మండల స్థాయి సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమన్వయ కమిటీలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. సింగిల్ యూజ్, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రతపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు.

Similar News

News January 11, 2026

BREAKING.. NLG:ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న RTC బస్సు

image

కేతపల్లి మండలం కొర్లపాడు సమీపంలో హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు, పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.

News January 11, 2026

KNR: ప్రత్యేక రైలు రేపటి వరకు పొడిగింపు

image

HYD-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ఫెస్టివల్ స్పెషల్ రైలును మరో 2 రోజులు పొడిగించారు. ముందుగా ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తుండగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12 తేదీల్లో కూడా నడపిస్తున్నారు. HYD – సిర్పూర్ కాగజ్‌నగర్(07473) మధ్య 11, 12వ తేదీల్లో ఉ. 7-55 గం.లకు బయలుదేరి మ. 2-15గం.లకు చేరుకుంటుంది. ఉమ్మడి KNRలో ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లో ఆగుతుంది.

News January 11, 2026

మన పల్నాడే పందేం కోళ్లకు అసలైన కేరాఫ్!

image

కోడి పందేలు అనగానే APలోని ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. అయితే కోడి పందేలు చరిత్ర శతాబ్దాల వెనక్కి వెళ్లితే ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాటి వీరగాథ ముందుకొస్తుంది. కోడి పందేలే కారణంగా పల్నాడు యుద్ధంలో రక్తపాతం జరిగింది. సామాజిక విభేదాలు, అధికార పోరాటాలు కోడి పందేల చుట్టూ ముదిరి చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు చరిత్రగా, ఒక రకంగా సంప్రదాయంగా ఉన్నాయి.