News March 17, 2025
అనకాపల్లి: ‘అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి’

స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రతి మండల ప్రత్యేక అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మండల స్థాయి సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమన్వయ కమిటీలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. సింగిల్ యూజ్, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రతపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు.
Similar News
News November 26, 2025
జగిత్యాలలో వృద్ధులకు జేరియాట్రిక్ వైద్య శిబిరం

ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ప్రత్యేక జేరియాట్రిక్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు. వృద్ధులకు డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలు, పక్షవాతం, మధుమేహం వంటి వ్యాధులకు ఉచిత చికిత్సతో పాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
News November 26, 2025
జగిత్యాల: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ ఫీజు చెల్లించాలి

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల వార్షిక పరీక్షలు 2026 జనవరి/ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో 5 డిసెంబర్ 2025లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. అప్లై చేసిన అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని జిల్లా విద్య అధికారి కార్యాలయంలో డిసెంబర్ 19 లోగా సమర్పించాలన్నారు.
News November 26, 2025
కొడిమ్యాల: దేవాలయ మేనేజ్మెంట్పై కేసు నమోదు

కొడిమ్యాల గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న కళ్యాణం సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి మెట్ల వద్ద ఆడుకుంటున్న తిప్పరవేణి నాగరాజు కుమార్తె మధుశ్రీ (11) డెకరేషన్ కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై మృతి చెందింది. భద్రతా నిర్లక్ష్యం కారణమని తండ్రి ఫిర్యాదు చేయడంతో ఆలయ మేనేజ్మెంట్పై కేసు నమోదు చేసినట్లు కొడిమ్యాల పోలీసులు తెలిపారు.


