News March 17, 2025
అనకాపల్లి: ‘అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి’

స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రతి మండల ప్రత్యేక అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో మండల స్థాయి సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమన్వయ కమిటీలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. సింగిల్ యూజ్, ప్లాస్టిక్ నిషేధం, పరిశుభ్రతపై ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలన్నారు.
Similar News
News April 24, 2025
PLAYOFFS: ఏ జట్టుకు ఎంత ఛాన్స్ అంటే?

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్కు ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టుకు 91% ప్లేఆఫ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. అతి తక్కువగా CSKకు 0.8 శాతం మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీ(85%), బెంగళూరు(62%), పంజాబ్(58%), ముంబై(51%), లక్నో(34%), కోల్కతా(15%), రాజస్థాన్(2%), హైదరాబాద్(1%) ఉన్నాయి.
News April 24, 2025
‘రెట్రో’ కథ ఆ హీరో కోసం అనుకున్నా: కార్తీక్ సుబ్బరాజు

‘రెట్రో’ సినిమా కథను దళపతి విజయ్ కోసం రాశారన్న ప్రచారంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్పందించారు. రజినీకాంత్ కోసం ఈ స్టోరీ రాసుకున్నట్లు వెల్లడించారు. సూపర్ స్టార్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేశానని తెలిపారు. సూర్య రావడంతో పలు మార్పులు చేసినట్లు చెప్పారు. సినిమాలో రొమాంటిక్ డ్రామాను జోడించినట్లు పేర్కొన్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
News April 24, 2025
అండమాన్లో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. బీజేపీ మద్దతుతో సౌత్ అండమాన్లోని శ్రీవిజయపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 24 మంది సభ్యులున్న కౌన్సిల్లో టీడీపీ 15 ఓట్లు రాబట్టి ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి సాహుల్ హమీద్ గెలుపొందారు.