News February 3, 2025

అనకాపల్లి: అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

image

వీఎంఆర్డీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి మండలం సిరసపల్లి, అంతకాపల్లి, బాటజంగాలపపాలెం గ్రామాల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వారి వెంట సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకులు గోపాలరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి శిల్ప, ప్రధాన ఇంజనీర్ భవాని శంకర్ ఉన్నారు.

Similar News

News April 17, 2026

కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జిల్లాలోని 385 పంచాయతీల్లో మొత్తం 12,58,456 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాకినాడ రూరల్‌లో పెండింగ్‌లో ఉన్న 6 పంచాయతీలతో సహా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News April 17, 2026

బుగ్గారం ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులపై కలెక్టర్ తనిఖీ

image

బుగ్గారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, మండల రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ పీడీ రఘువరన్, తహసీల్దార్ భూమేశ్వర్, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వాసవి, సర్పంచ్ నక్క రాజవ్వ, అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు, ప్రతిభ కనబరిచిన అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేస్తారని తెలిపారు.