News March 28, 2025
అనకాపల్లి: ఆనాటి కాకతాంబ.. నేడు నూకాంబిక

అనకాపల్లిలో 1450లో నూకాంబిక అమ్మవారు మొదట కాకతాంబగా కొలువైంది. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కాకతాంబ గుడిని నిర్మించారు. తర్వాత విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారుగా మార్చారు. 1935లో నూకాంబిక అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రతి ఏటా కొత్త అమావాస్య నుంచి నెలరోజులపాటు జాతర జరుగుతుంది.
Similar News
News November 18, 2025
రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.
News November 18, 2025
రంపచోడవరాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రికి వినతి

రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లా చేయాలని మంత్రి సత్యకుమార్ ను కోరామని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, స్వప్న కుమారి తెలిపారు. విజయవాడలో సోమవారం కలిసి ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. రంపచోడవరం, పోలవరం కలపడం వలన షెడ్యూల్ ఏరియా అంతా ఒకే జిల్లాలో.. గిరిజనుల హక్కులు, చట్టాలకు భంగం కలుగకుండా ఉంటుందని చెప్పారు.
News November 18, 2025
VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.


