News March 28, 2025
అనకాపల్లి: ఆనాటి కాకతాంబ.. నేడు నూకాంబిక

అనకాపల్లిలో 1450లో నూకాంబిక అమ్మవారు మొదట కాకతాంబగా కొలువైంది. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కాకతాంబ గుడిని నిర్మించారు. తర్వాత విజయనగరం రాజులు కాకతాంబ పేరును నూకాంబిక అమ్మవారుగా మార్చారు. 1935లో నూకాంబిక అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రతి ఏటా కొత్త అమావాస్య నుంచి నెలరోజులపాటు జాతర జరుగుతుంది.
Similar News
News October 16, 2025
HYD: అయ్యో.. ఆమె బయటపడుతుందా?

HYD మహిళకు 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు తీర్పునిచ్చింది. బహదూర్పురకు చెందిన మహిళ బ్యూటీషన్ పనికోసం దుబాయ్ వెళ్లడానికి ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేసుకుంది. అతడు ఆమెకు ఓ పార్సిల్ ఇచ్చాడని, ఎయిర్పోర్ట్లో దిగాక అందులో గంజాయి ఉందని కుటుంబీకులు ఆరోపించారు. ఆమెకు 5ఏళ్ల కొడుకు ఉన్నాడు. కుటుంబపోషణకు వెళ్తే.. జైలుశిక్ష పడిందని ఆమెను కాపాడాలని కేంద్రాన్ని కోరగా ప్రభుత్వం స్పందించింది.
News October 16, 2025
వనపర్తి: తప్పనిసరిగా పాఠశాలలను సందర్శించాలి- కలెక్టర్

ఎంఈఓలు, క్లస్టర్ హెడ్మాస్టర్లు తప్పనిసరిగా రోజుకు 2 లేదా 3 పాఠశాలలను విధిగా సందర్శించి, పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సందర్శించిన పాఠశాలల్లో FLN అటెండెన్స్, అపార్ ఐడి జనరేషన్ పై దృష్టి సారించి, మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమాజంలో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల పాత్ర కీలకం అన్నారు.
News October 16, 2025
KNR: సానుభూతితో కాదు.. పట్టుదల, ప్రతిభతో విజయం సాధించాలి

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలు సానుభూతితో కాకుండా పట్టుదల, నైపుణ్యంతో విజయం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కష్టపడి చదివితేనే విజయం సాధించవచ్చన్నారు. బాలికలు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ధైర్యంగా ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు.