News January 25, 2025
అనకాపల్లి: ఆన్లైన్ జాబ్ ఆఫర్.. లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే

ప్రముఖ సంస్థ పేరుతో ఆన్లైన్ జాబ్ ఆఫర్ అంటూ సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారని అనకాపల్లి జిల్లా పోలీసులు పేర్కొన్నారు. జాబ్ ఆఫర్ లెటర్ అంటూ వచ్చే లింక్లపై క్లిక్ చేయొద్దని సూచించారు. వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్, పాన్కార్డు, ఓటీపీ వివరాలు ఎప్పుడూ అపరిచితులకు షేర్ చేయవద్దు అన్నారు. సైబర్క్రైమ్ బాధితులు అయితే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News December 25, 2025
అడ్డతీగల: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

అడ్డతీగల మండలం కొట్టంపాలెం సమీప జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి అవంతి బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెరుకుంపాలెం సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.నవీన్ కుమార్, భార్య బేబీ కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో జరిగిన క్రిస్టమస్ ప్రార్ధనకు వెళ్లి చెరుకుంపాలెం తిరిగి వస్తుండగా ఎదురుగా అడ్డతీగల వైపు వెళుతున్న బస్సు ఢీకొట్టింది. పోలీసులు విచారిస్తున్నారు.
News December 25, 2025
నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

AP: మాజీ PM వాజ్ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
News December 25, 2025
శివస్వరూపంగా శ్రీనివాసుడు

తిరుమల మూలవిరాట్టును పూర్వం విష్ణు రూపమని కొందరు, శైవ రూపమని మరికొందరు భావించారు. స్వామివారి తలపై ఉండే జటలు, కంఠంలోని నాగభూషణాలు చూసి శివుడిగానూ ఆరాధించారు. విగ్రహానికి ఉన్న విలక్షణ లక్షణాలు శివ, కేశవ ఇరువురినీ స్మరింపజేస్తాయి. అందుకే ఇప్పటికీ తిరుమలలో శైవ, వైష్ణవ సంప్రదాయాల మేళవింపు కనిపిస్తుంది. విష్ణుమూర్తి సర్వవ్యాపి అని, ఆయనలో శివుడు కూడా అంతర్భాగమని చెప్పడానికి ఈ రూపం గొప్ప నిదర్శనం.


