News March 13, 2025

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 586 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 586 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి బి.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 11,419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,083 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 2,364 మంది హాజరు కావలసి ఉండగా 2,114 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News March 15, 2025

21 రోజులైనా దొరకని అచూకీ

image

TG: శ్రీశైలం SLBC టన్నెల్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఏడుగురి కార్మికుల ఆచూకీ 21 రోజులైనా లభించలేదు. సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు అత్యాధునిక రోబోలను ఉపయోగిస్తున్నారు. టన్నెల్‌లోకి బురద చేరడం, నీటి ఊట రావడంతో రెస్య్కూకు ఆటంకం కలుగుతోంది. ఐదు రోజుల క్రితం టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే.

News March 15, 2025

మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ

image

రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పనివేగంపై తుమ్మల విశ్లేషించారు.

News March 15, 2025

యూఎస్‌లో ఎప్పటికీ భాగమవ్వం: కెనడా ప్రధాని

image

కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ వస్తూనే తన మార్క్ చూపించారు. తమ దేశం ఎప్పుడూ యూఎస్‌లో భాగం కాబోదని స్పష్టం చేశారు. అయితే దేశ ప్రయోజనాల కోసం తాము ట్రంప్ అడ్మినిష్ట్రేషన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా జస్టిన్ ట్రూడో స్థానంలో కార్నీ కెనడా 24వ ప్రధాని ప్రమాణస్వీకారం చేశారు. ట్రంప్ యూఎస్ అధ్యక్షుడు అయ్యాక కెనడాను తమ దేశంలో భాగమవ్వమని కోరిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!