News March 12, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షలకు 325 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 12,481 విద్యార్థులకు గాను 12,156 మంది హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 5, 2025
సిరిసిల్ల: ‘CCI కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి’

CCI కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి పత్తికి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేటలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు, మొత్తం 5 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News November 5, 2025
ఈ సరసమైన రీఛార్జ్ ప్యాక్స్ అవసరం.. AIRTEL, JIOలకు విజ్ఞప్తులు!

అతితక్కువ మొబైల్ డేటాను వాడే సీనియర్ సిటిజన్లు, WiFi యూజర్లను దృష్టిలో ఉంచుకుని రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని AIRTEL, JIOలకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ప్రతి నెలా ₹100 కంటే తక్కువ ధరకు వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందించండి. అవసరం లేకపోయినా, ప్రజలు డేటాను తీసుకోవలసి వస్తుంది. డైలీ 1GB & వాయిస్ కాల్స్ ఇచ్చే నెల, వార్షిక ప్లాన్స్ ఇవ్వండి. BSNLలో సరసమైన ప్లాన్స్ ఉన్నాయి’ అని సూచిస్తున్నారు.
News November 5, 2025
భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ‘కొబ్బరి నీళ్లు అమ్మబడవు’

వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ‘కొబ్బరి నీళ్లు అమ్మబడవు’ అని సూచిస్తూ అధికారులు బుధవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొబ్బరి నీళ్లు విక్రయించడంపై విశ్వహిందూ పరిషత్ (VHP) ఫిర్యాదు చేయడంతో ఈవో సునీత స్పందించారు. ఈవో విచారణలో కొబ్బరిముక్కలు పోగు చేసుకునే టెండర్ పొందిన వ్యక్తి అనధికారికంగా కొబ్బరి నీళ్లు విక్రయిస్తున్నట్లు తేలింది. అతనికి రూ.15 వేల జరిమానా విధించారు.


