News March 12, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్షలకు 325 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి మొత్తం 12,481 విద్యార్థులకు గాను 12,156 మంది హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 16, 2025
ములుగు: జిల్లాలో సమస్యలపై స్పందన కరవు!

జిల్లాలో పాలన గాడి తప్పుతోంది. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సమస్యలపై స్పందన కరవైందని, ఎలాంటి సమస్య ఉన్న సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పత్రికలు, సోషల్ మీడియాలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న తనకేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సరైన విచారణ, చర్యలు లేకకపోవడం అధికారుల పనితనానికి నిదర్శనం.
News November 16, 2025
పుట్ట మధుకు CBI పిలుపు.. మంథని బీఆర్ఎస్లో టెన్షన్

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణకు రావలసిందిగా పుట్ట మధును CBI పిలవడంతో మంథని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉన్నట్లు తేలితే మంథనిలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. గత నెల రోజులుగా పెద్దపల్లిలో తిష్ట వేసిన CBI ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్నవారందరినీ ఇప్పటికే విచారించింది.
News November 16, 2025
సిద్దిపేట: కొండెక్కిన కోడి కూర ధర!

కార్తీక మాసంలో కూడా చికెన్ ధరలు మండిపోతున్నాయి. జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 220 నుంచి రూ.240 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.270 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.20 వరకు పెరిగింది. సిద్దిపేట మార్కెట్లో నాటుకోడి ధర కూడా కిలో రూ.500 పైనే పలుకుతుంది. ధరలు పెరగడంతో మాంస ప్రియులు నిట్టూరుస్తున్నారు.


