News February 25, 2025
అనకాపల్లి: ‘ఈనెల 27న వారికి సెలవు’

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈనెల 27వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 16, 2025
మంచిర్యాల: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

MNCL(D) దండేపల్లి(M) వెంకటరావుపేటకు చెందిన మల్లేషం-పోషవ్వ దంపతుల కూతురు దివ్యాంగురాలైన అర్చన(15) KNR జిల్లా వావిలాలపల్లిలో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్కు వెళ్లి వచ్చే సరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు.
News November 16, 2025
ప్రజా జీవితంలోకి రాబోతున్నా: ఆశ కిరణ్

వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. నేడు ఆశ కిరణ్ విజయవాడలో తన తండ్రి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఇప్పటి నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నా అని ఆమె అన్నారు. రాజకీయాల్లో శూన్యత ఉందని, వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనని చెప్పారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.
News November 16, 2025
కుమారుడి ఫస్ట్ బర్త్డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


