News March 22, 2025

అనకాపల్లి: ఉగాది నుంచి పల్లె పండుగ పనులు ప్రారంభం

image

అనకాపల్లి జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో మంజూరైన పనులను ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ పనులపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. అనంతరం ఆమె జిల్లా అధికారులతో పనుల ప్రగతిపై సమీక్షించారు. ఉగాది నుంచి వారం రోజులు పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News November 20, 2025

అపార్ట్‌మెంట్‌లో అందరికీ ఒకే వాస్తు ఉంటుందా?

image

అపార్ట్‌మెంట్ ప్రాంగణం ఒకటే అయినా వేర్వేరు బ్లాక్‌లు, టవర్లలో దిశలు మారుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘సింహద్వారం దిశ, గదుల అమరిక వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఫ్లాట్‌కి వాస్తు ఫలితాలు కూడా మారుతాయి. అందరికీ ఒకే వాస్తు వర్తించదు. ప్రతి ఫ్లాట్‌ని దాని దిశ, అమరిక ఆధారంగానే చూడాలి. మీ జన్మరాశి, పేరు ఆధారంగా వాస్తు అనుకూలంగా ఉందో లేదో చూడాలిలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 20, 2025

2031కి 100 కోట్ల 5G సబ్‌స్క్రిప్షన్లు

image

2031 చివరికి భారత్‌లో 5G సబ్‌స్క్రిప్షన్లు 100 కోట్లు దాటుతాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ అంచనా వేసింది. 2031 వరకు మొబైల్ సబ్‌స్క్రిప్షన్లలో 79% 5జీకి మారుతాయని పేర్కొంది. 2025 చివరికి 394 మిలియన్లకు సబ్‌స్క్రిప్షన్లు చేరుకున్నాయని, ఇది మొత్తం సబ్‌స్క్రిప్షన్లలో 32 శాతమని తెలిపింది. దేశంలో పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం, నెట్‌వర్క్ విస్తరణ, 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లే నిదర్శనమని చెప్పింది.

News November 20, 2025

PDPL: ‘ఓటర్ జాబితా ఫిర్యాదులు 22లోపు పరిష్కరించాలి’

image

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. 3 విడతల్లో ఎన్నికలు, మండలవారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఓటర్ జాబితా ఫిర్యాదులను నవంబర్ 22లోపు పరిష్కరించాలి అని సూచించారు. నవంబర్ 23న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితా ప్రచురించాలన్నారు. ఎంసీసీ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.