News January 30, 2025

అనకాపల్లి: ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 21,555 మంది

image

ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు ప్రస్తుతం 21,555 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 12,948, మహిళలు 8,607 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 123 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

చిన్నారుల్లో హెయిర్ ఫాల్ అవుతోందా?

image

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్‌ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారం పెట్టడంతో పాటు జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం మానుకోవాలంటున్నారు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గాక కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.

News October 24, 2025

తణుకు: నాగుల చవితికి తేగలు సిద్ధం

image

నాగులచవితి పురస్కరించుకొని మార్కెట్లో తేగలు అందుబాటులోకి వచ్చాయి. సహజసిద్ధంగా దొరికే తేగలు, బుర్ర గుంజు నాగులచవితి రోజున పుట్టలో వేస్తుంటారు. అప్పటినుంచి తేగలు తినడానికి మంచి రోజుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విరివిగా దొరికే తేగలను మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నాగుల చవితి రోజున వినియోగించడానికి ఒక్కో తేగను తణుకులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.

News October 24, 2025

ఖమ్మం: దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

image

భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో నరికి చంపిన దారుణ ఘటన ఏన్కూరు మండలం నాచారంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న తాటి గోవర్ధన(32)ను భర్త రామారావు అనుమానించేవాడు. ఈ విషయమై తెల్లవారుజామున ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో విసుగు చెందిన రామారావు గొడ్డలితో భార్యను చంపి, అనంతరం స్థానిక ఠాణాలో లొంగిపోయాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.