News March 28, 2025

అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌ను సందర్శించిన కలెక్టర్

image

అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ ను సందర్శించారు. మార్కెట్ యార్డ్ లో సమస్యలను కలెక్టర్‌కు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు బజార్ ఏర్పాటు చేసి మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. బెల్లం తయారు చేసే విధానాన్ని రైతులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.

Similar News

News November 18, 2025

చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

image

అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Chanel’ గ్లోబల్‌ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.

News November 18, 2025

చానెల్ CEO లీనా నాయర్ గురించి తెలుసా?

image

అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘Chanel’ గ్లోబల్‌ సీఈఓ లీనా నాయర్ భారతీయురాలని మీకు తెలుసా. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌‌లో పుట్టి పెరిగిన లీనా మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశారు. 1992లో HULలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడ ఆమె దక్షతను మెచ్చి చానెల్ CEOగా ఎంపిక చేశారు. ఆమె అందించిన సేవలకు గానూ యూకే ప్రభుత్వం అత్యున్నత గౌరవమైన కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్ ఎంపైర్ (CBE)తో సత్కరించారు.

News November 18, 2025

32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

image

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <>వెబ్‌సైట్‌<<>>లో అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మొత్తం 32,438 పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయనుంది.