News February 28, 2025

అనకాపల్లి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి రూ.107.46 కోట్లు

image

అనకాపల్లి జిల్లాలో మార్చి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.107.46 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,272 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము డ్రా చేస్తారన్నారు.

Similar News

News February 22, 2026

ట్రంప్ రిసార్ట్‌లోకి అగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని కాల్చి చంపారు. లొంగిపోవాలని సూచించగా అతను గన్ పైకెత్తడంతో కాల్పులు జరిపి అంతమొందించారు. ఘటన జరిగినప్పుడు ట్రంప్ వాషింగ్టన్‌లో ఉన్నారు. సముద్రతీరంలో నిర్మించిన ఈ రిసార్టును ట్రంప్ 1985లో కొనుగోలు చేశారు. దీన్ని వింటర్ వైట్‌హౌస్ అని పిలుస్తారు.

News February 22, 2026

అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

image

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.

News February 22, 2026

WGL: రేపు TG Ed.CET-2026 నోటిఫికేషన్ విడుదల!

image

తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Ed.CET-2026) నోటిఫికేషన్ రేపు (సోమవారం) విడుదల కానుంది. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎడ్ సెట్ చైర్మన్ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, దరఖాస్తుల ప్రక్రియ మరియు పరీక్షా షెడ్యూల్ వివరాలను వెల్లడించనున్నారు. బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు రేపటి నుండి కీలక తేదీల వివరాలను తెలుసుకోవచ్చు.