News January 26, 2025
అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఎగురవేసిన కలెక్టర్

అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లాస్థాయిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహీన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
ADB: పల్లెల్లో ఎన్నికలు.. పట్టణాల్లో దావతులు

పంచాయతీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఉండదని తెలిసి.. ఓటర్లను అక్కడికి తీసుకెళ్లి తమకే ఓటేయాలంటూ ఎర వేస్తున్నట్లు సమచారం. ఇప్పటికే ఎన్నికల నిబంధన కారణంగా వైన్స్ మూసివేయడంతో ఓటర్లను పట్టణాలకు తీసుకెళ్తున్నట్లు గ్రామాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ వారికి దావత్లు ఇచ్చి రేపు ఉదయానికి గ్రామాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించే పనిలో ఉన్నారు.
News December 10, 2025
ఉచిత ఇసుక పారదర్శకతకు కృషి: కలెక్టర్

ఉచిత ఇసుకను పారదర్శకంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4రీచ్లలో సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా ఇసుక తీసేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రీచ్లలో మర్లపాలెం, కపిలేశ్వరం, జొన్నాడ, ఆలమూరు రీచ్లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
News December 10, 2025
సూర్యాపేట: BRS కార్యకర్త హత్య.. హరీశ్రావు ఫైర్

పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్య హత్య ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక పాలనకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం బాధాకరమన్నారు.


