News March 6, 2025

అనకాపల్లి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మీ కామెంట్

image

అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు అయ్యే మిట్టల్ స్టీల్ ప్లాంట్లో లక్ష ఉద్యోగ అవకాశాలు ఉండగా కనీసం 20వేల ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నారు. మరి కొణతాల వ్యాఖ్యలపై మీ కామెంట్.

Similar News

News April 17, 2026

‘కమిటీ సూచనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది’

image

రాష్ట్రంలో కుల గణన సర్వే నిర్వహించిన నిపుణుల కమిటీ ఛైర్మన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. కమిటీ సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని, నివేదిక పారదర్శకంగా, శాస్త్రీయంగా రూపొందిందని చెప్పారు.

News April 17, 2026

మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అన్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లోడుతో మిల్లుల వద్ద లారీలు పడిగాపులు కాయకూడదని అన్నారు.

News April 17, 2026

జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు ఇవి పెట్టకూడదు

image

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు.