News February 8, 2025

అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.

Similar News

News October 20, 2025

విశాఖ-చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు

image

దీపావళి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీనీ దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలు నడపనుంది.అక్టోబర్21న సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుండి చర్లపల్లి(08541)మధ్య ప్రత్యేక రైలు బయల్దేరి,అక్టోబర్22ఉదయం 8గంటలకు చేరుతుంది.అలాగే అక్టోబర్ 22న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి -విశాఖ(08542)మధ్య ప్రత్యేక రైలు బయల్దేరి, అక్టోబర్23న ఉదయం7 గంటలకు విశాఖపట్నం చేరుతుందని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.

News October 20, 2025

అమలాపురం: నేడు ఎస్పీ పీజీఆర్ఎస్ రద్దు

image

అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని దీపావళి సందర్భంగా సోమవారం (20వ తేదీ) రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగను ప్రమాదాలకు తావు లేకుండా, ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.

News October 20, 2025

24 నుంచి బిహార్‌లో మోదీ ఎన్నికల ప్రచారం

image

ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి బిహార్‌లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఆ రాష్ట్ర BJP వర్గాలు తెలిపాయి. 24న సమస్తీపూర్, బెగుసరాయ్‌లో జరిగే రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని చెప్పాయి. తిరిగి 30న రెండు సభలకు హాజరవుతారని పేర్కొన్నాయి. నవంబర్ 2, 3, 6, 7వ తేదీల్లోనూ మోదీ ర్యాలీలు ఉంటాయని వివరించాయి. బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.