News April 17, 2025

అనకాపల్లి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష

image

అనకాపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం అట్రాసిటీ కేసుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించి సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఆర్డీవో సత్యనారాయణ రావు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2025

నారాయణపేట జిల్లాలో 6 తనిఖీ కేంద్రాల ఏర్పాటు

image

కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. జలాల్ పూర్, కాన్కూర్తి, చెగుంట, కృష్ణ నది బ్రిడ్జి, సమస్త పూర్, ఉజ్జెల్లి గ్రామాల వద్ద 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను 24 గంటలు పోలీసులు తనిఖీ చేస్తారని, రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఉంటారన్నారు.

News April 20, 2025

రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని MBNR కలెక్టర్ ఆగ్రహం

image

ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా అంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండీడ్ మండలం వెన్నచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. వేసవిలో కేంద్రాలకు వచ్చే రైతులకు నీడ, తాగునీరైనా కల్పించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు.

News April 20, 2025

కాంగ్రెస్‌ది చేతకాని పాలనకు నిదర్శనం: శ్రీనివాస్ గౌడ్

image

మద్యం ధరలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పరిశ్రమలు ఏర్పాటుచేసి పెట్టుబడులు రాబట్టాలి గాని మద్యం రేట్లు పెంచి ఆదాయాన్ని అర్జించాలనే ప్రభుత్వ ధోరణి చేతకాని పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.

error: Content is protected !!