News December 19, 2024
అనకాపల్లి: ఒకే కుటుంబంలో నలుగురికి గిన్నీస్ రికార్డ్లో చోటు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734614755959_51797742-normal-WIFI.webp)
అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు గిన్నీస్ బుక్ రికార్డును సాధించారు. చైనాలో స్థిరపడ్డ కొణతాల విజయ్, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. తాజాగా వారి పిల్లలిద్దరూ గిన్నీస్ రికార్డ్ నెలకొల్పారు. వారి కుమార్తె జస్మిత(14) ఒంటి కాలితో ఒక నిమిషంలో 168 సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది. వారి కుమారుడు శంకర్(5) 129 సార్లు స్కిపింగ్ చేసి రికార్డు సాధించాడు.
Similar News
News January 21, 2025
విశాఖలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737476150340_697-normal-WIFI.webp)
విశాఖలోని పీఎం పాలెం పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. HPCL లేఔట్లోని ఓ ఇంటిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నల్ల సాయితేజను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.
News January 21, 2025
ఏయూలో జపనీస్ భాషలో డిప్లొమా కోర్సు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737460842204_20522720-normal-WIFI.webp)
విద్యార్థులు, భాషా ఔత్సాహికులకు ఉత్తేజకరమైన పరిణామంలో ఏయూ జపనీస్ భాషలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలను ప్రారంభించింది. విదేశీ భాషల విభాగాధిపతి, జపాన్ సమాచార అధ్యయన కేంద్రం డైరెక్టర్ చల్లా రామకృష్ణ నేతృత్వంలోని ప్రారంభించింది. ఆసక్తిగల విద్యార్థులు ఏయూ అడ్మిషన్స్ డైరెక్టర్ లేదా ఏయూ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. 40సీట్లు ఉంటాయి. ఆరునెలల సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు.
News January 21, 2025
బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737470025403_697-normal-WIFI.webp)
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు హోం మంత్రి <<15209881>>అనిత కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో మాజీ మంత్రికి నిందితుడికి, సాక్షులకు తేడా తెలియడం లేదని విమర్శించారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.