News April 4, 2025

అనకాపల్లి: కడుపు నొప్పితో యువతి ఆత్మహత్య

image

కడుపు నొప్పి తాళలేక ఓ యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి మండలం కోడూరు గ్రామం ఎస్సీ కాలనీలో యల్లబిల్లి భారతి తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఎంతమంది వైద్యులకు చూపించినా నొప్పి తగ్గడం లేదు. దీంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 8, 2026

రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

image

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్‌తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.

News January 7, 2026

సింగరేణి హాకీ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం

image

డబ్ల్యూపీఎస్‌ & జీఏ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి స్థాయి హాకీ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఫైనల్స్‌లో శ్రీరాంపూర్‌ జట్టు, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా జట్టు తలపడ్డాయి. ఈ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ఆర్జీ 1 జీఏం డీ.లలిత్‌ కుమార్‌ హాజరై ట్రోఫీ అందజేశారు. శ్రీరాంపూర్‌ జట్టు కోల్‌ ఇండియా పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.

News January 7, 2026

చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

image

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.