News March 8, 2025

అనకాపల్లి కలెక్టర్, జేసీని సత్కరించిన మంత్రి

image

అనకాపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవిని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు. ఈ సందర్భంగా వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 17, 2025

ఏలూరు : బాలికపై అత్యాచారం .. కేసు

image

ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన పౌలు (20) అనే ఆటో డ్రైవర్‌పై రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 15 ఏళ్ల బాలికకు ప్రేమించానని మాయమాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

News March 17, 2025

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు నిల్..!

image

ఖమ్మం పాత బస్టాండ్‌లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోయారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు, ప్యాన్లు లేవన్నారు. మూత్రశాలలు సైతం కంపుకోడుతున్నాయని చెబుతున్నారు. బస్టాండ్ అవరణలో ఉన్న షాపుల వారు ఉన్న రేట్లకంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.

News March 17, 2025

అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

error: Content is protected !!