News March 3, 2025
అనకాపల్లి: గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు ప్రభుత్వానికి షాక్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపొందడంతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుlకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి గెలుపు కోసం కృషి చేశారు. అయితే అనుహ్యంగా శ్రీనివాసులi నాయుడు విజయం సాధించడంతో కూటమి నాయకులు ఖంగు తిన్నారు.
Similar News
News December 8, 2025
దేవరాపల్లి: రామాలయంపై నుంచి జారిపడి విద్యార్థి మృతి

తెనుగుపూడి జడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న కోన దినేష్ (13) ఆదివారం సాయంత్రం ఆటవిడుపుగా గరిసింగిలోని రామాలయంపైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దినేష్ను హుటాహుటిన 108 వాహనంలో కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డాడు. బాలుడి మృతదేహానికి కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి, తెనుగుపూడిలో సోమవారం అంత్యక్రియలు చేశారు.
News December 8, 2025
రెండు గెలాక్సీలు ఢీకొట్టుకుంటే..

ఈ విశ్వం ఎన్నో వింతలకు నిలయం. లక్షల కాంతి సంవత్సరాల దూరంలో నిత్యం అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. గెలాక్సీలు ఢీకొట్టడం/గురుత్వాకర్షణ శక్తితో ఐక్యమవడం నిరంతర ప్రక్రియ. అలా 2 గెలాక్సీలు కలిసిపోతున్న IC 1623 దృశ్యాన్ని నాసా ‘చంద్రా అబ్జర్వేటరీ’ రిలీజ్ చేసింది. ఇవి విలీనమై కొత్త నక్షత్రాలు లేదా బ్లాక్హోల్ ఏర్పడుతుందని తెలిపింది. కాగా ఈ చిత్రం వండర్ఫుల్గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News December 8, 2025
‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్లు నియామకం

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్ సంజీవ్లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.


