News March 3, 2025
అనకాపల్లి: గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు ప్రభుత్వానికి షాక్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపొందడంతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుlకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి గెలుపు కోసం కృషి చేశారు. అయితే అనుహ్యంగా శ్రీనివాసులi నాయుడు విజయం సాధించడంతో కూటమి నాయకులు ఖంగు తిన్నారు.
Similar News
News December 9, 2025
ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు యాసంగి పంటల ఆయకట్టుకు నీటి విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3న స్విసువాం కమిటీ నిర్ణయం ప్రకారం ఈనెల 24 వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువల ద్వారా ఈ సంవత్సరం యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేస్తునట్లు తెలిపారు. వార బంది పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతుంది.
News December 9, 2025
జగిత్యాల: పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు

జిల్లాలో ఈ నెల 11 నుండి 17 వరకు విడతల వారీగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు ఉంటాయని కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10 – 11 వరకు మొదటి విడత, 13 -14 వరకు రెండో విడత, 16-17 వరకు ఎన్నికలు ఉంటాయని, ఆయా గ్రామాల్లోని జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాల్ల పోలింగ్ కేంద్రాల్లో 2 రోజులు సెలవులు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.
News December 9, 2025
సిరిసిల్ల: ‘ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందించాలి’

ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతంగా అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ పని తీరుపై జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంచార్జి కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గర్భిణీల ఏ.ఎన్.సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.


