News March 3, 2025

అనకాపల్లి: గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపు ప్రభుత్వానికి షాక్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపొందడంతో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుlకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి గెలుపు కోసం కృషి చేశారు. అయితే అనుహ్యంగా శ్రీనివాసులi నాయుడు విజయం సాధించడంతో కూటమి నాయకులు ఖంగు తిన్నారు.

Similar News

News September 18, 2025

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

image

పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (MSP) కింద తగిన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 18, 2025

వేలూరు సీఎంసీలో ఎన్టీఆర్ వైద్య సేవ లేనట్లేనా..?

image

చిత్తూరు జిల్లా నిరుపేదలు చాలామంది వేలూరు CMC ఆసుపత్రికి వెళ్తుంటారు. క్రిటికల్ కేర్, యాక్సిడెంట్స్, ఇతర ఏ సమస్యలు వచ్చిన ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఈ ఆసుపత్రే. ఇది తమిళనాడులో ఉండటంతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు కావడం లేదు. రూ.లక్షల్లో బిల్లులతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోంది.

News September 18, 2025

రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

image

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.