News February 26, 2025

అనకాపల్లి: చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమ్మికూడి ఉండరాదని అన్నారు. పై ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News February 26, 2025

సంతాన ప్రాప్తి కలిగించే జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరం

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో ఉండే<<15583713>> ఘృష్ణేశ్వర<<>> ఆలయం చివరిది. స్థల పురాణం ప్రకారం శివుడి భక్తురాలి కుమారుణ్ని ఒక మహిళ కొలనులో విసిరేస్తుంది. దీంతో బాలుడు చనిపోతాడు. అంత బాధలోనూ ఆ మాత శంకరున్ని యధావిధిగా పూజిస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆమె కుమారునికి ప్రాణం పోస్తాడు. అనంతరం భక్తురాలి కోరిక మేరకు అక్కడే వెలుస్తాడు. ఈ క్షేత్రాన్నిదర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

News February 26, 2025

గుంటూరు జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: DEO

image

గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 26, 2025

కరీంనగర్: ప్రయాగరాజ్ వెళ్లి వస్తూ చనిపోయాడు..!

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వీణవంక మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం సభ్యుడు నల్లగోని వీరయ్య ఇటీవల యూపీలోని ప్రయాగరాజ్‌కు వెళ్లి కుంభమేళాలో పాల్గొని శివయ్యను దర్శించుకున్నాడు. తిరిగి వాహనంలో వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ పట్టణంలోకి రాగానే అతడికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.

error: Content is protected !!