News February 26, 2025
అనకాపల్లి: చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమ్మికూడి ఉండరాదని అన్నారు. పై ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.
Similar News
News October 23, 2025
NLG: తెల్ల బంగారం.. ఇలా అయ్యిందేంటి?!

పత్తి పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సిన పత్తి.. కనీసం ఐదారు క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో పత్తి సాగు చేసిన చేలల్లో దిగుబడి మరింత దారుణంగా ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 7,93,627 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండడంతో దీని ప్రభావం ప్రతి దిగుబడిపై పడిందని చెబుతున్నారు.
News October 23, 2025
చారకొండలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

గడచిన 24 గంటలలో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా చారకొండ మండలంలో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్లో 7.3, పెద్దకొత్తపల్లిలో 6.8, నాగర్కర్నూల్ 4.8, కల్వకుర్తిలో 4.5, తాడూరులో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
News October 23, 2025
మండవల్లి: షార్ట్ సర్క్కూట్తో ఎలక్ట్రీషయన్ మృతి

మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రీషయన్గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.