News January 25, 2025
అనకాపల్లి: ‘జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి’

అనకాపల్లి పట్టణంలో శనివారం జరిగే గౌరీ పరమేశ్వరుల జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాతరకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులకు ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
Similar News
News November 14, 2025
PDPL: శాండ్ రీచ్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం

పెద్దపల్లి జిల్లాలోని 19 శాండ్ రీచ్లు ఆగిపోవడంతో ప్రభుత్వం ఏడాదికి రూ.200 కోట్ల ఆదాయం కోల్పోతుంది. సహజ సంపదను తోడేయడంతో జీవవైవిధ్యం దెబ్బతింటుందంటూ మానేరు పరివాహక పరిరక్షణ సమితి NGTని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన NGT.. శాండ్ రీచ్లను నిలిపివేయాలని కలెక్టర్కు 2023లో ఆదేశాలు జారీచేసింది. అయితే ఈనెలలో NGT స్టేను వెకేట్ చేసి రీచ్లను ఓపెన్ చేసి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
News November 14, 2025
WGL మార్కెట్కు తేజ షార్క్ కొత్త మిర్చి రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం తేజ షార్క్ కొత్తమిర్చి 8 బస్తాలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. క్వింటాకు రూ.15,111 ధర వచ్చిందన్నారు. అలాగే టమాటా మిర్చి సైతం నేడు మార్కెట్కు రాగా రూ.30 వేల ధర పలికిందని చెప్పారు. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా రూ.2,075 ధర వచ్చింది.
News November 14, 2025
ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.


