News February 24, 2025

అనకాపల్లి జాతరపై పవన్‌కు వినతి

image

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన సోమవారం వినతిపత్రం అందజేశారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబికా అమ్మవారి జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు.

Similar News

News October 27, 2025

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం

News October 27, 2025

ALERT.. నల్గొండ జిల్లాపై ‘మొంథా’ ప్రభావం

image

రానున్న 2,3 రోజులు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దన్నారు.

News October 27, 2025

కరూర్ తొక్కిసలాటపై CBI దర్యాప్తు ప్రారంభం

image

TN కరూర్‌ తొక్కిసలాట కేసు దర్యాప్తును CBI అధికారంగా చేపట్టింది. FIRను రీ-రిజిస్టర్ చేసింది. ఇందులో TVK జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సహా పలువురు పేర్లున్నాయని, త్వరలో అరెస్టులు జరగొచ్చని సమాచారం. ఈ కేసును తొలుత SIT దర్యాప్తు చేయగా, CBIకి ఇవ్వాలని TVK సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కేసు దర్యాప్తును ధర్మాసనం CBIకి అప్పగించింది. కాగా బాధిత కుటుంబాలను విజయ్ ఇవాళ <<18105218>>పరామర్శించనున్నారు<<>>.