News March 10, 2025
అనకాపల్లి జిల్లాకు చేరిన పది పరీక్షల ప్రశ్నాపత్రాలు

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆదివారం అనకాపల్లి పోలీసు స్టేషన్కు చేరాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీటిని పరిశీలించిన అనంతరం స్టేషన్లోనే భద్రపరిచారు. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఆయా రోజుల్లో పరీక్ష ప్రారంభం కావడానికి కొద్దిసమయం ముందు ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్ నుంచి పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.
Similar News
News March 10, 2025
నటుడు పోసానికి బెయిల్ మంజూరు

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. నరసరావుపేట జిల్లా కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇద్దరు జామీన్, రూ.10వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పోసానిని ఆదేశించింది. చంద్రబాబు, పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదుతో గతేడాది నవంబర్లో నరసరావుపేట 2టౌన్ పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది. అయితే మిగతా కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన బయటకొచ్చే అవకాశం లేదు.
News March 10, 2025
నంద్యాల జిల్లాలో TODAY TOP NEWS

☞ ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్ ☞ ఉయ్యాలవాడలో కొడుకు చేతిలో తల్లి దారుణ హత్య ☞ వైసీపీ పాలనతో విద్యార్థులకు తీవ్రనష్టం: ఎంపీ శబరి ☞ వైసీపీ వాళ్లే ‘ఆడుదాం ఆంధ్ర’ ఆడారు: అఖిలప్రియ ☞ మహానందీశ్వరుని దర్శనానికి వెళ్లొస్తూ యువకుడి దుర్మరణం ☞ గుండ్ల శింగవరంలో కాటసాని ప్రత్యేక పూజలు ☞ కొలిమిగుండ్ల సీఐపై YCP సంచలన ఆరోపణలు ☞ కొనసాగుతున్న గాలికుంటు టీకాల కార్యక్రమం
News March 10, 2025
ఆ సినిమా చూడలేక మధ్యలోనే వెళ్లిపోయాం: కిరణ్ అబ్బవరం

మార్కో సినిమాలో హింసను భరించలేకపోయామని యువ నటుడు కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా భార్యతో కలిసి ఆ సినిమాకు వెళ్లాను. తను గర్భంతో ఉంది. సెకండ్ హాఫ్ సమయానికి చూడలేకపోయాం. ఆమె చాలా అసౌకర్యాన్ని ఫీలైంది. దీంతో ఇంకా చాలా సినిమా ఉండగానే బయటికొచ్చేశాం’ అని పేర్కొన్నారు. మలయాళ చరిత్రలో అత్యంత హింసాత్మక సినిమాగా పేరొందిన మార్కోకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రావడం గమనార్హం.