News March 10, 2025

అనకాపల్లి జిల్లాకు చేరిన పది పరీక్షల ప్రశ్నాపత్రాలు

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆదివారం అనకాపల్లి పోలీసు స్టేషన్‌కు చేరాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీటిని పరిశీలించిన అనంతరం స్టేషన్‌లోనే భద్రపరిచారు. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఆయా రోజుల్లో పరీక్ష ప్రారంభం కావడానికి కొద్దిసమయం ముందు ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్‌ నుంచి పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.

Similar News

News February 11, 2026

మోయినాబాద్‌: పార్టీలు వేరైనా.. మా దోస్తీ ఒక్కటే!

image

రాజకీయం వేరు.. స్నేహం వేరని ఓ ముగ్గురు మిత్రులు నిరూపించారు. మోయినాబాద్‌ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ముగ్గురు స్నేహితులు వేర్వేరు పార్టీల జెండాలు పట్టుకుని, తమ అభ్యర్థుల గెలుపు కోసం వీధి వీధి తిరిగారు. ప్రచారంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్నా.. పోలింగ్‌ ముగియగానే ఆ రంగులను పక్కనపెట్టేశారు. మళ్లీ ఆత్మీయంగా కలుసుకున్నారు.

News February 11, 2026

వరంగల్ జిల్లాలో 85.42శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్ధన్నపేట, నర్సంపేట పట్టణాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.42శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో 51,494 ఓట్లకు గాను 43,985 మంది ఓటు వేశారు. ఇందులో వర్ధన్నపేటలో 86.23శాతం, నర్సంపేటలో 85.21శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా జిల్లాలో 84.93శాతం పురుషులు, 85.87శాతం మహిళలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News February 11, 2026

జమ్మికుంట: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ప్రకారం.. ధర్మారంకు చెందిన మారపల్లి <<19106431>>ఐలయ్య<<>> (59) మంగళవారం రాత్రి బస్టాండ్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా JMKT నుంచి వావిలాల వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం HNK తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందినట్లు కుమారుడు అజయ్ పిర్యాదు చేసినట్లు తెలిపారు.