News January 28, 2025

అనకాపల్లి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

ఇండస్ట్రియల్ జిల్లా అయిన అనకాపల్లిలో బీచ్‌తో పాటు గిరిజన ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ విజయ్ కృష్ణన్ అన్నారు. తంతడి, సీతంపాలెం బీచ్ ప్రాంతాలను ఫ్రంట్ టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. సోమవారం విశాఖలో జరిగిన రీజినల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్‌లో ఆమె పాల్గొన్నారు. ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలన్నారు.

Similar News

News December 5, 2025

పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

image

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

News December 5, 2025

కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

image

TG: నర్సంపేట సభలో మాజీ మంత్రి KTRపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘నిన్నమొన్న జూబ్లీహిల్స్‌లో ఒకడు తీట నోరు వేసుకొని తిరిగాడు. ఉపఎన్నిక రెఫరెండం.. రేవంత్ సంగతి తేలుస్తా అన్నాడు. అక్కడ చెత్తంతా రేవంతే వేస్తుండని ప్రచారం చేశాడు. ఇళ్లిళ్లు తిరిగి అందరి కడుపులో తలకాయ పెట్టిండు.. కాళ్లకు దండం పెట్టిండు. వీని తీట అణగాలని ఓటర్లు కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు’ అని విమర్శలు గుప్పించారు.

News December 5, 2025

కరీంనగర్: అభ్యర్థులకు కోతుల ‘పంచాయితీ’..!

image

కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని కోతుల ‘పంచాయితీ’ తీరిస్తేనే ‘పంచాయతీ’ పట్టం కడతామంటూ పలుచోట్ల అభ్యర్థులకు ఓటర్లు తెగేసి చెప్తున్నారు. దీంతో చేసేది లేక సమస్య తీరుస్తామని అభ్యర్థులు హామి ఇస్తున్నారు. మరి మీ గ్రామంలోనూ కోతుల సమస్య ఉందా?.