News February 23, 2025
అనకాపల్లి జిల్లాలోని 646 గ్రామాల్లో చెత్త సేకరణ డ్రైవ్

అనకాపల్లి జిల్లాలో ప్రతి ఇంటి నుండి చెత్తసేకరణ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి తెలిపారు. పంచాయితీ రాజ్ కమిషనర్ (పి.ఆర్.&ఆర్.డి.) ఆదేశాలను పురస్కరించుకొని శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 646 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించామన్నారు.
Similar News
News December 8, 2025
రీల్ రిపోర్టర్ కావాలనుకుంటున్నారా?

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రీల్స్ చేసే వారికి/ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. Way2Newsలో రీల్ రిపోర్టర్గా చేరి స్థానికంగా పేరుతో పాటు నెలకు ₹15 వేల నుంచి ₹40 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఎంచుకున్న కేటగిరీలో స్పష్టంగా వివరిస్తూ రీల్ చేసి పంపితే తదునుగుణంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. వివరాలకు <
News December 8, 2025
హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు : పోలీసుల హెచ్చరిక

తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నుంచి No Helmet–No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా, హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల వాహనం నడుపుతున్నవారు, వెనుక కూర్చునే వారు ఇద్దరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
News December 8, 2025
టెట్ పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు: జేసీ

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరంలో 5, నరసాపురంలో 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


