News February 23, 2025

అనకాపల్లి జిల్లాలోని 646 గ్రామాల్లో చెత్త సేకరణ డ్రైవ్

image

అనకాపల్లి జిల్లాలో ప్రతి ఇంటి నుండి చెత్తసేకరణ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి తెలిపారు. పంచాయితీ రాజ్ కమిషనర్ (పి.ఆర్.&ఆర్.డి.) ఆదేశాలను పురస్కరించుకొని శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 646 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించామన్నారు.

Similar News

News December 1, 2025

తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

image

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.

News December 1, 2025

14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 1, 2025

మన ఎంపీలు గళమెత్తాల్సిన సమయం

image

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్నూలు–నంద్యాల, కర్నూలు-మంత్రాలయం మధ్య నూతన రైల్వే లైన్ నిర్మాణం, ఆలూరు, ఆదోని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ కలుషితం సమస్యలు, మొక్కజొన్న పంటకు మద్దతు ధర, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కేంద్ర ప్యాకేజీ అవసరంపై మన ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తాల్సిన అవసరం ఉంది.