News February 23, 2025
అనకాపల్లి జిల్లాలోని 646 గ్రామాల్లో చెత్త సేకరణ డ్రైవ్

అనకాపల్లి జిల్లాలో ప్రతి ఇంటి నుండి చెత్తసేకరణ ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆర్. శిరీషారాణి తెలిపారు. పంచాయితీ రాజ్ కమిషనర్ (పి.ఆర్.&ఆర్.డి.) ఆదేశాలను పురస్కరించుకొని శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 646 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించామన్నారు.
Similar News
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News November 21, 2025
మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ నేపథ్యం

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా డా.శబరీష్ నియామకమైన విషయం తెలిసిందే. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సుధీర్ రాంనాథ్ కేకన్ ములుగు జిల్లా ఎస్పీకు బదిలీ అయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శబరీశ్ 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.
News November 21, 2025
నవంబర్ 23 నుంచి ఓపెన్ యూనివర్సిటీ తరగతులు ప్రారంభం

డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం, నిజామాబాదులో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్తో పాటు, పీజీ (MBA) మొదటి సెమిస్టర్, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి.
నవంబర్ 23 ఆదివారం ఉదయం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా.పి. రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త డా. కె. రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.


