News January 29, 2025
అనకాపల్లి జిల్లాలో అమల్లోకి ఎన్నికల కోడ్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. వచ్చేనెల 3న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. 10వ తేదీ నామినేషన్లకు చివరి రోజుగా పేర్కొన్నారు. ఉపసంహరణకు 13 చివరి తేదీ అని తెలిపారు. పోలింగ్ ఫిబ్రవరి 27వ తేదీన, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
Similar News
News November 23, 2025
బాపట్ల: 108 వాహనాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బాపట్ల జిల్లా 108 వాహనాల్లో పైలట్ పోస్ట్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్ పోస్ట్కు 10th పాస్, హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ , బ్యాడ్జ్ అర్హతలు కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారు నవంబర్ 24వ తేది(సోమవారం) సాయంత్రం లోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News November 23, 2025
అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.
News November 23, 2025
KMR: పెళ్లిరోజునే కాంగ్రెస్ అరుదైన గిఫ్ట్

నిజాంసాగర్కు చెందిన మల్లికార్జున్ ఆలే కామారెడ్డి DCC అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన రాజకీయ ప్రస్థానం 2000 స.లో కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. మొదట నిజాంసాగర్ NSUI అధ్యక్షుడిగా ఆ తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్గా, మండల వైస్ MPPగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నిబద్ధతకు గుర్తింపుగా జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే శుభవార్త రావడం విశేషం.


