News March 6, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ వడ్డాదిలో ఘనంగా మోదకొండమ్మ తీర్థం ➤ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి: MLA కొణతాల ➤ చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ పీడీకీ సత్కారం ➤ ఈ నెల 10న అనకాపల్లి సత్యనారాయణ స్వామి కళ్యాణం➤ గీత కార్మికుల 15 వైన్ షాపులకు లాటరీ ప్రక్రియ పూర్తి➤ నర్సీపట్నం బీసీ హాస్టల్ తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్➤ పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ-4 సర్వే: జిల్లా కలెక్టర్➤ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఓపెన్ హౌస్
Similar News
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.
News September 15, 2025
పాక్పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

ఆసియా కప్లో పాకిస్థాన్ను ఓడించి హోటల్కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్డే కావడంతో స్పెషల్ కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్స్టా అకౌంట్లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.
News September 15, 2025
HYD: 435 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 435 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 306 బైకులు, 30 త్రీవీలర్, 97 ఫోర్ వీలర్లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.