News March 15, 2025
అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ దిబ్బడి, కె.ఎం.పాలెంలో అగ్నికి ఆహుతైన తోటలు
➤ జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం
➤ CMRF చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ చెత్త సంపద కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్
➤ ఖండివరం హైస్కూల్ HMకు షోకాజ్ నోటీసులు
➤ మాకవరపాలెంలో విద్యార్థులకు గ్రంధి వాపు పరీక్షలు
➤ నేటితో ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు
➤ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు
Similar News
News November 28, 2025
గ్రీన్కార్డ్ ఇంటర్వ్యూకు వెళ్తే అరెస్ట్ చేస్తున్న పోలీసులు

గ్రీన్కార్డు ఇంటర్వ్యూలకు వెళ్లిన విదేశీ పౌరులను అరెస్టు చేస్తున్నారు. శాన్ డియాగోలో వీసా ఇంటర్వ్యూకు వెళ్లిన తన క్లయింట్స్ ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఓ లాయర్ చెప్పారు. అరెస్టైన వారంతా US సిటిజన్ల జీవితభాగస్వాములని, వీసా గడువు ముగిసినా ఎటువంటి క్రిమినల్ కేసులు వారిపై లేవన్నారు. ఇంటర్వ్యూకు వచ్చిన వారిలో వీసా గడువు ముగిసిన వారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ నస్సేరీ తెలిపారు.
News November 28, 2025
రాచకొండలో 110 మంది ఈవ్టీజర్ల అరెస్ట్

రాచకొండ పోలీసులు మహిళల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో నవంబర్ 1 నుంచి 15 వరకు 110 మంది ఈవ్టీజర్లను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ వేధింపులు 34, సోషల్ మీడియా వేధింపులు 48, ప్రత్యక్ష వేధింపుల ఫిర్యాదులు 53 నమోదయ్యాయి. 7,481 మందికి మహిళా భద్రతపై అవగాహన కల్పించారు. ఫిర్యాదుల కోసం 8712662111 నంబర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
News November 28, 2025
హుస్నాబాద్: 1995లో సర్పంచ్.. 2 పర్యాయాలు ఎమ్మెల్యే

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు మొదట సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1995లో ఆయన సింగాపూర్ సర్పంచ్గా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. అనంతరం ఫాక్స్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) ఛైర్మన్గా పనిచేసిన సతీష్ బాబు.. 2014, 2018లో రెండు పర్యాయాలు హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేశారు.


